మానవత్వం... కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు!
- కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ
- ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాని వైనం
- హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించిన పోలీసులు
అయితే ఆమె డెడ్ బాడీని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీంతో ఢిల్లీ పోలీసులే ఆమెకు అంత్యక్రియలను నిర్వహించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మానవతా ధృక్పథంతోనే తాము ఈ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. హిందూ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహించామని చెప్పారు. మరోవైపు, పోలీసులు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.