బ్యాంకింగ్, మెటల్స్ షేర్ల అండతో దూసుకుపోయిన మార్కెట్లు

Stock Market ends in profits
  • 508 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 143 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం వరకు లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 508 పాయింట్లు లాభపడి 48,386కి చేరింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 14,485 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్స్ (4.40%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.63%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (3.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.35%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.66%), మారుతి సుజుకి (-0.52%), సన్ ఫార్మా (-0.49%), టీసీఎస్ (-0.28%).
Go Back to Shorts
Sensex
nif
Stock Market

More Telugu News