దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. పూర్తి అప్ డేట్స్!
- గత 24 గంటల్లో 2,812 మంది మృతి
- 3,52,991 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
- దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 28,13,658
మరోవైపు కరోనా రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోవడం ఆందోళనను పెంచుతోంది. దేశంలో అత్యధిక కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 66 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 832 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వైరస్ భారీగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,19,11,223 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.