తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే..
- ఎల్లుండి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
- సీఎం ఆదేశాలతో ప్రకటించిన మంత్రి సబిత
- పున:ప్రారంభంపై జూన్ 1న నిర్ణయమని వెల్లడి
ఈ నేపథ్యంలోనే సీఎం ఆదేశాల మేరకు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్టు ఆమె చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీనే చివరి పనిదినమన్నారు. కాగా, ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని, 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని ఆమె గుర్తు చేశారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53.79 లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు.