Manmohan singh: కరోనా నుంచి కోలుకుంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

Manmohan Singh Recovering from Corona Virus
షార్ట్స్‌లో చూడండి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. కరోనా బారినపడిన మన్మోహన్ సింగ్ ఈ నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, మన్మోహన్ ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నారు. గత నెల 4న తొలి విడత టీకా వేయించుకోగా, ఈ నెల 3న రెండో దఫా టీకా వేయించుకున్నారు.

మన్మోహన్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ మధ్య జ్వరం కూడా  రాలేదని పేర్కొన్నారు. మన్మోహన్ కోలుకోవాలని ప్రార్థించిన భారత ప్రజలందరికీ ఈ సందర్భంగా రణ్‌దీప్ కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
Manmohan singh
Congress
Corona Virus

More Telugu News