మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదు: కేసీఆర్ కుటుంబంపై కిషన్ రెడ్డి ఆగ్రహం
- కేసీఆర్ కుటుంబం కేంద్ర సర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తోంది
- రాష్ట్రంలో కరోనా లెక్కల ప్రకారమే కేంద్ర సర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరా
- మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్, రెమ్డెసివిర్ సరఫరా
రాష్ట్రంలో నమోదవుతోన్న కేసులు, మరణాల లెక్కల ప్రకారమే రాష్ట్రానికి కేంద్ర సర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తోందని తెలిపారు. అలాగే, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్, రెమ్డెసివిర్ సరఫరా అవుతుందని వివరించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు 24 గంటలు (మూడు షిఫ్టుల్లో) కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు.