కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వ వివరణ పట్ల హైకోర్టు అసంతృప్తి!
- దేశంలో కరోనా సెకండ్ వేవ్
- ప్రమాదకర పరిస్థితుల్లో రాష్ట్రాలు!
- ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్న తెలంగాణ హైకోర్టు
- ఆర్టీపీసీఆర్ రిపోర్టుల నేపథ్యంలో కోర్టు అసంతృప్తి
పొరుగు రాష్ట్రాలతో సరిహద్దుల వద్ద తీసుకుంటున్న చర్యలపై వివరించాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులు 24 గంటల్లో ఎందుకు ఇవ్వడంలేదు? వీఐపీల కరోనా పరీక్షల ఫలితాలు 24 గంటల్లోనే ఎలా వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తుంటే ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రించడంలేదని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విదేశాల నుంచి వచ్చేవారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఎందుకు అడగడంలేదని నిలదీసింది.