మహారాష్ట్రలో ఆసుపత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది సజీవ దహనం
- ఐసీయూలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్
- ఘటన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు
- రెండు గంటలు శ్రమించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
ఘటన సమయంలో ఐసీయూలో 17 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. మిగతా వారిని ఆసుపత్రి నుంచి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నాసిక్లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ కారణంగా సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.