భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన యూఏఈ!
- ఇండియాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
- విమాన రాకపోకలపై 10 రోజుల నిషేధం విధించిన యూఏఈ
- భారత్ మీదుగా ప్రయాణించిన వారు యూఏఈలో ప్రవేశించవద్దని ఆంక్షలు
తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలను 10 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, యూఏఈ మరో సంచలన ప్రకటన చేసింది. భారత్ మీదుగా గత 14 రోజుల్లో ప్రయాణించినవారెవరూ యూఏఈలో అడుగు పెట్టవద్దని ప్రకటించింది.