ఢిల్లీకి పూర్తి కోటా ఆక్సిజన్ ఇవ్వండి: కేంద్రాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
- 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వెంటనే సరఫరా చేయండి
- ఆక్సిజన్ ట్యాంకర్లకు పూర్తి భద్రతను కల్పించండి
- మా ఆదేశాలను విస్మరిస్తే క్రిమినల్ చర్యలను చేపడతాం
ఆక్సిజన్ ట్యాంకర్లకు పూర్తి భద్రత కల్పించాలని, మార్గమధ్యంలో ఆ వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అత్యవసర ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంకర్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఢిల్లీకి రప్పించాలని చెప్పింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఢిల్లీకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. తమ ఆదేశాలను పాటించకపోతే క్రిమినల్ చర్యలను చేపడతామని హెచ్చరించింది.