నైట్ కర్ఫ్యూ వేళ పోలీసుల లాఠీచార్జ్ అంటూ యూట్యూబ్లో వీడియోలు.. చానల్ రిపోర్టర్ అరెస్ట్
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- నిన్నటి నుంచే అమల్లోకి
- తొలి రోజు పోలీసులు లాఠీలకు పనిచెప్పారంటూ వీడియోలు
- క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన హైదరాబాద్ సీపీ
అయితే, రాత్రి తొమ్మిది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝళిపించారంటూ ఓ యూట్యూబ్ చానల్ పలు వీడియోలను పోస్టు చేసింది. ఇందులో ప్రజలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నట్టు ఉంది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆ వీడియోలు పోస్టు చేసిన చానల్ రిపోర్టరుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్టు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.