కొవిడ్ ఎఫెక్ట్: భారత పర్యటన రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని
- ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం
- భారత్ లో అత్యంత తీవ్రంగా కరోనా వ్యాప్తి
- తొలుత పర్యటన కుదించుకున్న బోరిస్ జాన్సన్
- ఆపై పూర్తిగా రద్దు నిర్ణయం
- వర్చువల్ విధానంలో మోదీతో భేటీ కానున్న బ్రిటీష్ ప్రధాని
ఈ నేపథ్యంలో, వర్చువల్ విధానంలో భారత్, బ్రిటన్ పెద్దలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అంగీకరించారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.