కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ
- భారత్ లో కరోనా విలయం
- గత 24 గంటల్లో 2.61 లక్షల కేసులు
- పశ్చిమ బెంగాల్ లో ఇంకా 3 విడతల ఎన్నికలు
- సభలు, రోడ్ షోలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ
- ఇతర నేతలు కూడా దీనిపై ఆలోచించాలని పిలుపు
బెంగాల్ లో తాను పాల్గొనాల్సిన అన్ని సభలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. రాజకీయ నేతలందరూ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, భారీ ప్రజానీకంతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తే వచ్చే పర్యవసానాలపై లోతుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రధాన పోటీ అంతా అధికార టీఎంసీ, బీజేపీ మధ్యే నెలకొంది. ఇప్పుడు రాహుల్ సభలు రద్దు చేసుకున్నా కాంగ్రెస్ కు కలిగే నష్టం ఏమీ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.