తిరుపతి బరిలో దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి... వీడియో ఇదిగో!
- తిరుపతి పార్లమెంటు స్థానానికి నేడు ఉప ఎన్నిక
- కొనసాగుతున్న పోలింగ్
- ఓ పోలింగ్ బూత్ ను సందర్శించిన పనబాక
- దొంగ ఓటర్లను గుర్తించిన వైనం
- గేట్లు మూసి అందరినీ పట్టుకున్న పోలీసులు
పనబాక లక్ష్మి తమను గుర్తించడంతో దొంగ ఓటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు వారిని దొరకబుచ్చుకున్నారు. పోలింగ్ కేంద్రం గేట్లు వేయించి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని ఓ వాహనంలో సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ న్యూస్ చానల్ పంచుకుంది.