ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ ముంబయి... టాస్ గెలిచిన కోల్ కతా
- చెన్నై వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
- మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న కోల్ కతా
- ముంబయి జట్టులో ఒక మార్పు
- క్రిస్ లిన్ స్థానంలో డికాక్
ఈ మ్యాచ్ కు కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టును ఓడించిన కోల్ కతా నేటి మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. ఇక, ముంబయి జట్టులో క్రిస్ లిన్ స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడు. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి.