ఆంధ్రప్రదేశ్ పై కరోనా పడగ... 4 వేలు దాటిన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 35,582 కరోనా పరీక్షలు
- 4,228 మందికి పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 842 కేసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 48 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 10 మంది మృతి
అదే సమయంలో 1,483 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 9,32,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,99,721 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,850 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,321కి చేరింది.