ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు మమతా బెనర్జీ ధర్నా
- దీదీ ఎన్నికల ప్రచారంపై ఈసీ 24 గంటల నిషేధం
- అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన మమత
- కోల్కతాలో రేపు మధ్యాహ్నం ధర్నా
- ఇప్పటి వరకు 2సార్లు నోటీసులు అందుకున్న దీదీ
ఇటీవల ప్రచారంలో భాగంగా కేంద్ర బలగాలపై ఆరోపణలు చేసిన మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాలు తృణమూల్ ఓటర్లను అడ్డుకుంటున్నారని.. వారిని ఘెరావ్ చేయాలని ప్రచారంలో మమత పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం కఠిన చర్యలకు దిగింది. ఆమె ప్రచారంపై 24 గంటల నిషేధం విధించింది. మరో సందర్భంలో మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేసే వ్యాఖ్యలు చేసినందుకుగానూ దీదీ తొలిసారి ఈసీ నోటీసులు అందుకున్నారు.