YS Vivekananda Reddy: పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ అధికారులు

CBI officials vists Viveka house in Pulivendula
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను క్షుణ్ణంగా శోధించారు. వివేకా ఇంటిని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా వివేకా పీఏ హిదయతుల్లాను ప్రశ్నించారు. వివేకా ముఖ్య అనుచరుడు యర్ర గంగిరెడ్డిని కూడా సీబీఐ బృందం నిశితంగా ప్రశ్నించింది.

ఇటీవల వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దోషులెవరో తేల్చాలని కోరారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టిన కొన్నిరోజుల్లోనే సీబీఐ అధికారులు పులివెందుల రావడం ఆసక్తి కలిగిస్తోంది.
Go Back to Shorts
YS Vivekananda Reddy
Murder Case
CBI
Viveka House
Pulivendula

More Telugu News