జగన్ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎవరూ చేయవద్దు: స్పీకర్ తమ్మినేని సీతారాం
- వాలంటీర్ వ్యవస్థ స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది
- వాలంటీర్లకు కొందరు రాజకీయాలను ఆపాదిస్తున్నారు
- వాలంటీర్లు మరింత ఉత్సాహంగా పని చేయాలి
ప్రజల్లో ఒక్క శాతం అసంతృప్తి కూడా ఉండటానికి వీల్లేదని తమ్మినేని అన్నారు. వాలంటీర్లు మరింత ఉత్సాహంగా పని చేయాలని చెప్పారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను మరిచిపోలేమని అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడుతున్న జగన్ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని ఎవరూ చేయవద్దని కోరారు. భవిష్యత్తులో కూడా జగన్ వంటి సీఎం రాలేరనే నినాదంతో పని చేద్దామని చెప్పారు.