జమ్మూకశ్మీర్లో మరో ముగ్గురు ఉగ్రవాదుల హతం
- గురువారం నాటి ఎన్కౌంటర్లో ఐదుగురు హతం
- ఉగ్రవాదులు ముగ్గురు అల్బగర్ సంస్థకు చెందినవారే
- కొనసాగుతున్న ఆపరేషన్
ఈ క్రమంలో ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరిన ఓ ఉగ్రవాదిని లొంగిపోవాలంటూ భద్రతా దళాలు విజ్ఞప్తి చేశాయి. అతడి తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకొచ్చి వారితో చెప్పించారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదు. మిగతా ఉగ్రవాదులు కూడా అతడిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, షోపియాన్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.