Corona Virus: ఏపీలో 3 వేలకు పైగా కొత్త కేసుల నమోదు... 12 మంది మృతి

  • ఏపీలో కరోనా వ్యాప్తి అధికం
  • గత 24 గంటల్లో 31,929 కరోనా పరీక్షలు
  • 3,309 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 740 మందికి పాజిటివ్
  • గుంటూరు జిల్లాలో 527 కేసులు
Three thousand above new cases in AP

ఏడాదిన్నర కిందట దేశంలో ప్రవేశించిన కరోనా వైరస్ భూతం సెకండ్ వేవ్ లో మరింత తీవ్రరూపం దాల్చింది. నానాటికీ కొత్త కేసుల సంఖ్య అధికమవుతోంది. ఏపీలోనూ ఆ తీవ్రత కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 31,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,309 మందికి కరోనా నిర్ధారణ అయింది.

చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 కేసులు వెల్లడయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో విజయనగరం (97), పశ్చిమ గోదావరి (26) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,053 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ముగ్గురు బలయ్యారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,291కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906కి చేరింది. 8,95,949 మంది కోలుకున్నారు. ఇంకా 18,666 మంది చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News