తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వందల కోట్లు చేతులు మారుతున్నాయి: దేవినేని ఉమ ఆరోపణలు
- కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించాలి
- వైసీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్నారు
- జగన్ అహంకారాన్ని ప్రజలు ఓటుతో దించాలి
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు దళారుల కేంద్రాలుగా మారాయని ఆయన విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో జగన్ అహంకారాన్ని ప్రజలు ఓటుతో దించాలని ఆయన సూచించారు. ఏపీలో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.