Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

  • అవంతిపొరా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
  • షోఫియాన్‌ జిల్లాలో మరో ముగ్గురు ముష్కరుల ఖతం
  • కొనసాగుతున్న కాల్పులు
5 Terrorists killed in Two Encounters in Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఈ ఉదయం వేర్వేరు చోట్ల జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు పడి ఉన్నాయి. 


షోఫియాన్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో మసీదులో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News