చంద్రబాబు పీఏను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు
- ఇటీవల కుప్పం మండలంలో విగ్రహాల ధ్వంసం
- సంబంధంలేని వారిని ప్రశ్నిస్తున్నారంటూ టీడీపీ ఆగ్రహం
- కుప్పం సీఐ కార్యాలయం ఎదుట చంద్రబాబు పీఏ ధర్నా
- పీఏతో పాటు టీడీపీ నేతల అరెస్ట్
కాగా, గోనుగూరు ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనివాళ్లను విచారణ పేరుతో ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు పీఏ మనోహర్, టీడీపీ నేతలు కుప్పంలో సీఐ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.