పనిచేసే ఆఫీసుల్లోనే కరోనా వ్యాక్సిన్లు... కేంద్రం కీలక నిర్ణయం
- దేశంలో మరోసారి వేగంగా పాకిపోతున్న కరోనా
- వ్యాక్సినేషన్ లో స్పీడు పెంచిన కేంద్రం
- ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్
- కనీసం 100 మంది సిద్ధంగా ఉంటే ఆఫీసుల్లోనే వ్యాక్సినేషన్
ఈ నెల 11 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. అయితే, ఓ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలంటే కనీసం 100 మంది సిద్ధంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్లకు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ నెలలో అనేక సెలవులు ఉన్నప్పటికీ, కరోనా టీకా డోసులను ప్రతిరోజు వేయాలని నిర్ణయించారు.