BJP: కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తాం: బండి సంజయ్‌

  • నేడు బీజేపీ పదాధికారుల సమావేశం
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • హాజరైన తరుణ్‌ చుగ్‌, కిషన్‌ రెడ్డి
  • సమకాలీన అంశాలపై విస్తృత చర్చ
TS BJP Decided to intensify protest against KCR Regime

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని తీర్మానించినట్లు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు నేడు రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

భవిష్యత్తులో అనుసరించాల్సిప వ్యూహాలపై పదాధికారులు, మోర్చా అధ్యక్షులు మార్గనిర్దేశం చేశారని బండి సంజయ్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News