షర్మిల ఖమ్మం సభ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు!
- ఖమ్మంలో ఏప్రిల్ 9న షర్మిల బహిరంగ సభ
- ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోలీసులు
- తెలంగాణలో కరోనా తీవ్రం
- ఈ నేపథ్యంలో జీవో 68, 69 ప్రకారం నోటీసులు
- నిబంధనలు పాటిస్తూ సభ జరుపుతామన్న నిర్వాహకులు
ఈ క్రమంలోనే పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. అయితే, కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఖమ్మం సభ ద్వారానే తన పార్టీ పేరు, గుర్తు ప్రకటించాలని షర్మిల భావిస్తున్నారు.