బంగ్లాదేశ్ లో మహమ్మారి వీర విజృంభణ... లాక్ డౌన్ పెట్టిన ప్రభుత్వం!
- వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు
- ఒక్క రోజులో 6,800 కేసులు రావడంతో నిర్ణయం
- ఎమర్జెన్సీ సేవలకు అనుమతి
తాజాగా, 24 గంటల వ్యవధిలో 6,800కు పైగా కేసులు రావడం, మరణాల సంఖ్య 50గా నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఒబైదుల్ కోరారు. కరోనాను నియంత్రణలోకి తేవాల్సిన అవసరం ఉందని, అందుకే మరోమారు నిబంధనలతో కూడిన లాక్ డౌన్ ను విధిస్తున్నామని స్పష్టం చేశారు.