ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు: ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని
- ఏపీలోని పార్టీలతో ముగిసిన సమావేశం
- ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న నీలం సాహ్ని
- గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయిందని వ్యాఖ్య
- ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పిలుపు
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆమె అన్నారు. అలాగే, ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కాగా, ఆమె నిర్వహించిన సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరుకాగా, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవ్వరూ హాజరుకాలేదు.