కాసేపట్లో ఏపీ ఎస్ఈసీ సమావేశం.. బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నేడు ఏపీలోని అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. మరోవైపు, బీజేపీ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఈ సమావేశానికి హాజరుకాబోమని జనసేన పార్టీ నిన్ననే ప్రకటించింది.
ఎన్నికలపై ముందుగా చర్చించకుండానే షెడ్యూల్ ను ప్రకటించడం పట్ల ఆయా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి వీలుగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ కోరుతోంది.
ఎన్నికలపై ముందుగా చర్చించకుండానే షెడ్యూల్ ను ప్రకటించడం పట్ల ఆయా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి వీలుగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ కోరుతోంది.