Chhattisgarh: రోగ నిరోధకశక్తిని బలహీనం చేసే కొత్తరకం వేరియంట్‌.. చత్తీస్‌గఢ్‌లో గుర్తింపు

  • ఐదు వేర్వేరు నమూనాలను పరీక్షించిన అనంతరం నిర్ధారణ
  • కొత్త వేరియంట్ ఉనికిని నిర్ధారించిన కేంద్రం
  • ప్రాణాంతకం కాదన్న చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి
Scientists find corona virus new variant in Chhattishgarh

శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనం చేసే కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ ఒక దానిని చత్తీస్‌గఢ్‌లో గుర్తించారు. ఐదు వేర్వేరు నమూనాలను పరీక్షించిన అనంతరం ఈ వేరియంట్‌ను నిర్ధారించారు. దీనికి ఎన్-440గా నామకరణం చేశారు. దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ రోగ నిరోధకశక్తిని పిప్పిచేసే వేరియంట్ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

కొత్త వేరియంట్ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది. చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ మాట్లాడుతూ.. ఈ వైరస్ ప్రాణాంతకం కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించిన కేసులు నమోదు కాలేదన్నారు. కాగా, కొత్త వేరియంట్ రోగుల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

More Telugu News