news paper: అమాంతం పెరిగిపోయిన పాత న్యూస్ పేప‌ర్ ధ‌ర‌!

  • సాధార‌ణంగా కిలోకు రూ.4 నుంచి  రూ.9
  • ఇప్పుడు కిలో ధర రూ.35
  • క‌రోనా కార‌ణంగా కొర‌త‌
news paper price hike

పాత ఇనుప సామగ్రి, పేప‌ర్ల‌ను కొనే వారు కిలో న్యూస్ పేప‌ర్ల‌కు సాధార‌ణంగా కిలోకు రూ.4 నుంచి రూ.9 మ‌ధ్య ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు పాత న్యూస్ పేప‌ర్ల‌కు డిమాండ్ విప‌రీతంగా పెరిగిపోయింది. ఏడాదిగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో పేప‌ర్లు వేయించుకునే వారి సంఖ్య పడిపోయింది.

పాత పేప‌ర్లు మార్కెట్లోకి రావ‌డం భారీగా త‌గ్గిపోయింది. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది. ప‌లు అవ‌స‌రాల నిమిత్తం పాత పేప‌ర్లను కొనుగోలు చేయాల‌నుకునేవారికి వ్యాపారులు కిలో ధర రూ. 35కు అమ్ముతున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి 10 టన్నుల పేపర్‌ను గుజరాత్‌ నుంచి కొనుగోలు చేశారు. వాటిని భారీగా ధ‌ర‌కు నిజామాబాద్, నిర్మల్‌ ప్రాంతాల్లో విక్రయించారు.

More Telugu News