టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు బీ-ఫారం అందజేసిన సీఎం కేసీఆర్
- నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక
- టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఖరారు
- తెలంగాణ భవన్ లో భగత్ కు బీ-ఫారం అందజేత
- ఆశీస్సులు అందించిన సీఎం కేసీఆర్
సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ తరఫున కంకణాల నివేదితా రెడ్డి బరిలో దిగుతారని భావిస్తున్నారు. ఇదిలావుంచితే, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.