సాగర్ ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసిన టీఆర్ఎస్
- నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కు టికెట్
- రేపు ఉదయం నామినేషన్ వేయనున్న భగత్
- ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ
మరోపక్క, కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత జనారెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులు నామినేషన్లను వేయడానికి ఈ నెల 30 వరకు గడువు ఉంది. 31న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా... మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. సాగర్ లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.