సచిన్ వాజే సమక్షంలో... ముంబై నదిలో గాలింపు.. హార్డ్ డిస్క్ స్వాధీనం!
29-03-2021 Mon 08:48
- ముఖేష్ అంబానీ ఇంటివద్ద కారులో పేలుడు పదార్థాలు
- మొత్తం వ్యవహారం సచిన్ వాజే చుట్టూ
- నదిలో ల్యాప్ టాప్, వాహనం నంబర్ ప్లేట్లు కూడా లభ్యం

ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద లభించిన కారులో పేలుడు పదార్థాలు ఉన్న కేసులో అరెస్ట్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే సమక్షంలో తూర్పు బాంద్రాలోని మిధీ నదిలో హార్డ్ డిస్క్ ను విచారణ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హార్డ్ డిస్క్ ను నాశనం చేయాలని భావించిన సచిన్ వాజే, దానితో పాటు కారు నంబర్ ప్లేట్లను నదిలో విసిరివేసినట్టు అధికారులకు తెలుపగా, ఆయన్ను తీసుకుని వెళ్లి, ఎక్కడ పడేశాడో తెలుసుకుని, గజ ఈతగాళ్ల సాయంతో వాటిని వెలికి తీశారు. ఈ పరిణామంతో కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టేనని, మొత్తం కుట్ర సచిన్ వాజే నేతృత్వంలోనే జరిగిందనడానికి ఈ హార్డ్ డిస్క్ కీలకమని అధికారులు వ్యాఖ్యానించారు.
ఈ పేలుడు పదార్ధాల కేసులో తొలుత సచిన్ వాజేను అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ), ఈ కేసును ప్రస్తుతం మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో మున్సుక్ హిరాన్ హత్య కేసును విచారిస్తున్న మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, సచిన్ వాజేను కీలక నిందితుడిగా భావిస్తోంది. మున్సుక్ కారునే దొంగిలించి, దానిలో పేలుడు పదార్థాలు పెట్టి, అంబానీ ఇంటి ముందు ఉంచిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం నదిలోకి దిగిన డైవర్లు, ఓ ల్యాప్ టాప్ ను, సీపీయూను, 'ఎంహెచ్ 20 ఎఫ్పీ 1539' నంబర్ ప్లేట్ ను బయటకు తెచ్చారు. అంతకుముందు గురువారం నాడు ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సచిన్ వాజే ఇంట్లో, లెక్కచూపని 62 బులెట్లను కనుగొన్నామని పేర్కొన్నారు. సర్వీస్ రివాల్వర్ కోసం 30 బులెట్లను వాజేకు ఇచ్చారని, వాటిల్లో కేవలం 5 మాత్రమే రికవర్ అయ్యాయని, మిగతావి ఏమయ్యాయన్న లెక్క తెలియడం లేదని కూడా విచారణ అధికారులు పేర్కొన్నారు.
ఈ పేలుడు పదార్ధాల కేసులో తొలుత సచిన్ వాజేను అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ), ఈ కేసును ప్రస్తుతం మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో మున్సుక్ హిరాన్ హత్య కేసును విచారిస్తున్న మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, సచిన్ వాజేను కీలక నిందితుడిగా భావిస్తోంది. మున్సుక్ కారునే దొంగిలించి, దానిలో పేలుడు పదార్థాలు పెట్టి, అంబానీ ఇంటి ముందు ఉంచిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం నదిలోకి దిగిన డైవర్లు, ఓ ల్యాప్ టాప్ ను, సీపీయూను, 'ఎంహెచ్ 20 ఎఫ్పీ 1539' నంబర్ ప్లేట్ ను బయటకు తెచ్చారు. అంతకుముందు గురువారం నాడు ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సచిన్ వాజే ఇంట్లో, లెక్కచూపని 62 బులెట్లను కనుగొన్నామని పేర్కొన్నారు. సర్వీస్ రివాల్వర్ కోసం 30 బులెట్లను వాజేకు ఇచ్చారని, వాటిల్లో కేవలం 5 మాత్రమే రికవర్ అయ్యాయని, మిగతావి ఏమయ్యాయన్న లెక్క తెలియడం లేదని కూడా విచారణ అధికారులు పేర్కొన్నారు.
More Telugu News


పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్
8 hours ago


జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాల వేగ పరిమితి పెంపు!
10 hours ago


మలేసియాకు 'వాల్తేరు వీరయ్య'
11 hours ago

వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
11 hours ago


బాలకృష్ణ సరసన ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్?
12 hours ago



మార్కెట్లకు వరుసగా మూడో రోజు కూడా నష్టాలే!
13 hours ago
Advertisement
Video News

Kashmir terror attack: TV actor Amreen Bhat killed, her nephew sustains injuries
7 hours ago
Advertisement 36

9 PM Telugu News: 25th May 2022
7 hours ago

Anand Mahindra says, 'Rohit Shetty will require a nuclear bomb to blow up this car,'
8 hours ago

YSRCP suspends MLC Anantha Babu from the party
9 hours ago

Kashmiri separatist Yasin Malik gets life in jail in terror funding case
10 hours ago

'Gaami' title announcement- Sneak Peek video- Vishwaksen, Chandini Chowdary
10 hours ago

Sajjala Ramakrishna Reddy reacts to violence in Amalapuram
12 hours ago

FBI foiled terror plot to kill George W Bush
13 hours ago

'Thank You Teaser' - Naga Chaitanya, Raashi Khanna
13 hours ago

Kapil Sibal quits from Congress; speaks to media
13 hours ago

Watch: Beggar buys Rs 90,000 moped for wife after she complained of backache
13 hours ago

Spicejet faces ransomware attack; flight operations affected
14 hours ago

KTR may become PM in 20 years, lauds angel investor at Davos
14 hours ago

Pawan Kalyan cites the reason for Konaseema controversy
15 hours ago

Ra Ra Rakkamma Telugu lyric video- Vikrant Rona movie- Kichcha Sudeep, Jacqueline Fernandez
15 hours ago

Minister Dadisetti Raja comments on Chandrababu, Pawan Kalyan
16 hours ago