ఎయిరిండియాను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం.. కేంద్ర ముందు రెండే మార్గాలు!
- పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు
- ప్రైవేటీకరించకపోవడం అనే సమస్యే లేదు
- సంస్థకు రోజుకు రూ.20 వేల కోట్ల నష్టం
- సంస్థ పేరు మీద రూ.60 వేల కోట్ల రుణాలు
ఎయిరిండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని శుక్రవారం హర్దీప్ తెలిపారు. మే నెలాఖరుకు పూర్తికావచ్చని అంచనా వేశారు. ఆ తర్వాతే ఎయిరిండియా ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలుస్తుందన్నారు. మరోవైపు ఎయిరిండియా కోసం ఆల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో కలిసి స్పైస్జెట్ యజమాని అజయ్సింగ్, ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూప్ ప్రమోటర్ అంకుర్ భాటియా, టాటా సన్స్ బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం.