England: వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన ఇంగ్లండ్

  • పూణేలో ఇంగ్లండ్ ఛేజింగ్
  • స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు డౌన్
  • 40 ఓవర్లలో 317/4
  • ఇంకా 20 పరుగుల దూరంలో ఇంగ్లండ్
England faces pressure after losing three quick wickets

క్రికెట్ ఆటను అనిశ్చితికి మరోపేరుగా పేర్కొంటారు. మ్యాచ్ లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. టీమిండియాతో రెండో వన్డేలో ఇంగ్లండ్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియా విసిరిన 337 పరుగుల లక్ష్యఛేదనలో ఆ జట్టు అద్భుతంగా ఆడింది. ఓ దశలో వికెట్ నష్టానికి 285 పరుగులతో గెలుపు ముంగిట నిలిచినట్టే కనిపించింది. అయితే బెన్ స్టోక్స్ (99) ను సెంచరీ ముంగిట భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో కథ మారింది.

ఆ తర్వాత సెంచరీ హీరో బెయిర్ స్టో (124)ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ మరో వికెట్ చేజార్చుకుంది. అదే ఓవర్లో జోస్ బట్టర్ ను కూడా ప్రసిద్ధ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఆ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టన్ ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 20 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లున్నాయి.

More Telugu News