నూతనంగా నియమితులైన పంచాయతీ కార్యదర్శుల వేతనాల పెంపు... సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి
- అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నిర్ణయం
- సమాన పనికి సమాన వేతనం
- ప్రస్తుత కార్యదర్శులతో సమానంగా కొత్త కార్యదర్శులకు వేతనం
- రెట్టింపు వేతనం అందుకుంటారన్న ఎర్రబెల్లి
- మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపు
కొత్తగా నియమితులైన 9,355 మంది పంచాయతీ కార్యదర్శులకు లబ్ది చేకూరుతుందని ఎర్రబెల్లి తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఇప్పుడందుకున్న వేతనాలకంటే ఇకపై రెట్టింపు అందుకోనున్నారని వివరించారు. ఈ సందర్భంగా, పంచాయతీ కార్యదర్శులు ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.