National Capital Territory of Delhi Bill: తీవ్ర గందరగోళం మధ్య నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పించే బిల్లు
  • అరుపులు, వాకౌట్ల మధ్య పాస్ అయిన బిల్లు
  • బిల్లును వ్యతిరేకించిన వైసీపీ
Rajya Sabha passes the Government of National Capital Territory of Delhi Bill

విపక్షాల నిరసనలు, అరుపులు, వాకౌట్ల మధ్య నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

మరోవైపు ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు విపక్షాలు గట్టిగా ఎదిరించాయి. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని చెప్పారు. రాజ్యాంగానికి లోబడే బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీల్లో బీజేడీ, సమాజ్ వాదీ, టీఎంసీ తదితర పార్టీలతో పాటు వైసీపీ కూడా ఉంది.

పార్లమెంటు ఉభయసభలు బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో... దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఆయన సంతకం చేసిన తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది.

  • Loading...

More Telugu News