మావోయిస్టుల దాడిలో ఐదుగురు పోలీసుల మృతి
- ఛత్తీస్గఢ్, నారాయణపూర్ జిల్లాలో ఘటన
- సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకున్నమావోలు
- మరో 14 మందికి తీవ్ర గాయాలు
- కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఘటన
నారాయణపూర్ జిల్లాలో కడేనార్, కన్హరగావ్ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ డీజీపీ డీఎం అవస్థీ మాట్లాడుతూ.. కూంబింగ్ నిర్వహించిన అనంతరం తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.