Andhra Pradesh: ఈ నెల 26న భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోంది: మంత్రి పేర్ని నాని

  • బంద్ కు పిలుపునిచ్చిన కిసాన్ సంయుక్త మోర్చా
  • ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీడీపీ
  • తాజాగా ప్రభుత్వ వైఖరి వెల్లడించిన పేర్ని నాని
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సుల నిలిపివేత
AP Minister Perni Nani said state government will support Bharat Bandh

జాతీయ వ్యవసాయ చట్టాల రద్దు, పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు టీడీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్ని నాని భారత్ బంద్ పై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు.

ఈ నెల 26న చేపట్టబోయే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆ రోజున మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు నిలిపివేస్తామని చెప్పారు. బంద్ లో శాంతియుతంగా నిరసన తెలపాలని మంత్రి కోరారు. 

More Telugu News