ట్విట్టర్ లో వచ్చిన తొలి ట్వీట్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న బ్రిడ్జ్ ఒరాకిల్ సీఈఓ
- ఈ నెల 21కి ట్విట్టర్ కు 15 ఏళ్లు
- "జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్" అంటూ తొలి ట్వీట్
- ఓ వెబ్ సైట్ ద్వారా అమ్మకం
- రూ.21 కోట్లకు కొనుగోలు చేసిన సీనా ఎస్టావీ
ఈ ట్వీట్ ను కొనుగోలు చేసేందుకు భారీగా పోటీ పడ్డారు. చివరికి బ్రిడ్జ్ ఒరాకిల్ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ రూ.21 కోట్లు చెల్లించి జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్ అనే అపురూపమైన ట్వీట్ ను సొంతం చేసుకున్నారు. కాగా, ఈ ట్వీట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చుతానని, 'గివ్ డైరెక్టీస్ ఆఫ్రికా రెస్పాన్స్' అనే ఎన్జీవోకు విరాళంగా అందిస్తానని జాక్ డోర్సీ వెల్లడించారు.