జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు ధరించండి: మంత్రి ఈటల
- వైద్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
- ప్రజల భాగస్వామ్యం ఉంటేనే వైరస్ కట్టడి సాధ్యమవుతుందన్న మంత్రి
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రజలకు మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం కూడదని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి పేర్కొన్నారు.