'మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన' అంటూ ప్రచారం.. సంజయ్ రౌత్ ఆగ్రహం!
- ఎన్డీఏకి ఓ హెచ్చరిక చేస్తున్నాను
- దర్యాప్తు సంస్థలను తప్పుదారిలో వాడుకుంటున్నారు
- రాష్ట్రపతి పాలన విధిస్తే రేగే మంటల్లో మీరు కాలిపోతారు
రాష్ట్రపతి పాలన విధించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అయితే తాను ఎన్డీఏకి ఓ హెచ్చరిక చేస్తున్నానని చెప్పారు. 'మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే రేగే మంటల్లో మీరు కాలిపోతారు' అని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్రలో వరుసగా చోటు చేసుకుంటోన్న పరిణామాల వల్ల ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పిన శివసేన మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.