మరోసారి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్
- మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం
- మన దేశాన్ని అమెరికా పాలించిందని వ్యాఖ్య
- విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
ఇక ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను విమానంలో ప్రయాణిస్తుండగా.. ఓ ఇద్దరు పిల్లల తల్లి చిరిగిన జీన్స్ వేసుకుందని, అలాంటి మహిళ సమాజానికి ఏం సందేశం ఇస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తొలిసారి వార్తలకెక్కారు. దీంతో నెట్టింట పెద్దఎత్తున చర్చ నడిచింది. తాజాగా అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ నోరు జారి మరోసారి నెటిజన్లకు చిక్కారు. ‘జీన్స్’ రగడ సద్దుమణగక ముందే ఇది తెరపైకి రావడంతో విమర్శకులు తమ నోళ్లకు పనిచెప్పారు.