AstraZeneca: మా టీకాలో ఏ జంతువు పదార్థాలను వినియోగించలేదు.. స్పష్టం చేసిన ఆస్ట్రాజెనెకా

  • ఇండోనేసియాలో వచ్చిన వదంతులపై స్పందన
  • పందికి సంబంధించిన పదార్థాల్ని వాడలేదని స్పష్టం
  • పునఃసమీక్షించి ఓకే చేసిన ఇండోనేసియా ఔషధ నియంత్రణ సంస్థ
No animal related products were used in astrazeneca vaccine clears company

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకాలో పందితో సంబంధం ఉన్న ఉత్పత్తుల్ని వినియోగించారంటూ ఇండోనేసియాలో వచ్చిన వార్తల్ని సంస్థ తోసిపుచ్చింది. ఈ టీకాలో పంది క్లోమంలో ఉండే ట్రిప్సిన్‌ని వినియోగించారని ఆ దేశానికి చెందిన అత్యున్నత ముస్లిం మత సంస్థ ఉలేమా కౌన్సిల్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఈ టీకా వినియోగంపై ఆ దేశంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయినప్పటికీ, ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టీకా వినియోగానికి కౌన్సిల్ అనుమతించింది.

దీనిపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా స్పందించింది. వ్యాక్సిన్‌ తయారీలో పందికిగానీ లేదా ఇతర ఏ జంతువులతోనైనా సంబంధం ఉన్న పదార్థాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇండోనేసియా ఔషధ నియంత్రణ సంస్థ ప్రయోగ ఫలితాల్ని మరోసారి సమీక్షించింది. వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించింది.

More Telugu News