tv: వ‌చ్చే నెల నుంచి టీవీల ధ‌ర‌ల పెరుగుదల

tv prises increase in next month
షార్ట్స్‌లో చూడండి
వ‌చ్చేనెల నుంచి దేశంలో టీవీల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. గ్లోబ‌ల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండ‌డంతో భార‌త్ లో కంపెనీలు టీవీల ధ‌ర‌ల‌ను పెంచేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇప్ప‌టికే ఎల్‌జీ కంపెనీ ధ‌ర‌ల‌ను పెంచ‌గా, ప్యానసోనిక్, హాయెర్, థామ్సన్ తో పాటు ప‌లు బ్రాండ్లు వ‌చ్చే నెల నుంచి ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.  

అంత‌ర్జాతీయంగా ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలోనే తామూ టీవీ ధరలు పెంచక తప్పట్లేద‌ని ప్యానసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా సీఈవో మనీశ్ శర్మ మీడియాకు చెప్పారు. ఈ ధ‌ర‌లు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందని వివ‌రించారు.

హాయెర్ అప్లయెన్సెస్ ప్ర‌తినిధులు కూడా ఈ విష‌యాన్నే తెలిపారు. దేశంలో 32 అంగుళాల టీవీలు అత్య‌ధికంగా అమ్ముడుపోతాయి. వీటి ధరలు రూ.5,000 నుంచి రూ. 6,000 మధ్య పెరిగే అవకాశం ఉంది. టీవీల ధ‌ర‌లు పెరుగుతాయ‌ని కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
tv
India

More Telugu News