ఈరోజు మా అమ్మ వ్యాక్సిన్ వేయించుకున్నారు: మోదీ
- అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న మోదీ
- టీకా వేయించుకునేలా అందర్నీ ప్రోత్సహించాలని పిలుపు
- ప్రస్తుతం చిన్న కుమారుడి వద్ద ఉంటున్న మోదీ తల్లి
మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59 మధ్య వయసులో ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు సమాచారం. మార్చి 1న మోదీ తొలి వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు టీకా తీసుకున్నారు.