Corona Virus: ఏపీలో మరోసారి 100కు పైగా కొత్త కరోనా కేసుల నమోదు

  • 24 గంటల్లో 120 కొత్త కేసుల నమోదు
  • చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,064 యాక్టివ్ కేసులు
Ap registers 120 new Corona cases

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో సైతం క్రమంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 48,973 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా 120 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మందికి కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 93 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,004కి చేరుకుంది. ఇప్పటి వరకు 8,82,763 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 7,177 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News