రిపబ్లిక్ టీవీలో ఫేక్ న్యూస్ ప్రసారం చేశారు: సజ్జల
- వైసీపీపై అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు
- అర్నాబ్ ఈ జాతికి పట్టిన పీడ
- వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదు
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఆ టీవీలో ఫేక్ కథనాలు వచ్చాయని అన్నారు. జగన్ పాప్యులారిటీని తట్టుకోలేకే ఇలాంటి కథనాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి ఎన్నో అంశాలుంటే... వాటిని వదిలేసి, వైసీపీపై ఫేక్ వార్తలను జనాల్లోకి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ కథనాల వెనుక ఎవరున్నారనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.